రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై చేసిన ట్వీట్‌ పై RGV క్లారిటీ

-

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆర్జీవీ..తన ట్వీట్‌ పై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై చేసిన ట్వీట్‌… కేవలం వ్యంగ్యంగా చేశానని.. వేరే విధంగా ఉద్దేశించి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదని వెల్లడించారు.

రాజకీయాల్లో వెన్ను పోట్లు పొడుచుకోవడం కామన్‌ అంటూ సెటైర్‌ వేశారు. కాగా ఇదే వివాదంపై రాం గోపాల్‌ వర్మ పై బిజెపి పా ర్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి అని.. అయన తాగి ట్వీట్స్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని.. వార్త ల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటాడని నిప్పులు చెరిగారు బిజెపి పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news