ఆ ఒక్క విషయమే మళ్లీ నిలబెట్టిందంటున్న సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులని ఒక్క విషయంతో దాటగలిగాను అంటూ తెలిపారు.

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా యశోద చిత్రంతో మంచి సక్సెస్ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం శకుంతలం సినిమాలో నటించిగా ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా సమంత కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పవచ్చు. దాదాపు 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా గడుపుతుంది చిత్ర బృందం. కాగా ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. “గత రెండున్నరేళ్లలో నా జీవితంలో చాలా జరుగుతున్నాయని భావిస్తున్నాను. ఈ సమయంలో ఎన్నో బాధలు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోయా.. అయితే వీటన్నిటి నుండి నా పనే నిజంగా నన్ను నిలబెట్టింది. ఇప్పటికీ నిలకడగా ఉండే శక్తిని ఇచ్చింది. నేను సాధారణంగా దేని కారణంగా నా పనిని ప్రభావితం చేయనివ్వను. నేను మంచం మీద నుండి లేవలేకపోతే తప్ప. కానీ గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది.. అయితే నా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఇటు ప్రొడక్షన్ వారు అటు నా అభిమానులు నాకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు ఇవన్నీ నన్ను మళ్లీ కోలుకునేలా చేశాయి..” అంటూ చెప్పుకొచ్చారు సమంత.

 

కాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news