రఘువరన్ చనిపోవడానికి ఆమె కారణం – ఆయన సోదరుడు..!

-

ప్రముఖ నటుడు రఘువరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈయన దక్షిణాది భాషలన్నింటిలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా హిందీ చిత్రాలలో కూడా రఘువరన్ ప్రేక్షకులను అలరించి, ఆ తర్వాత విలక్షణ నటుడిగా జనం మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇకపోతే చివరి రోజుల్లో మధ్యానికి బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19వ తేదీన కన్నుమూశారు. అయితే ఇదే విషయంపై తాజాగా ఆయన తమ్ముడు మాట్లాడుతూ.. ఆయన మరణానికి కారణం ఆయన భార్య అంటూ షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే రఘువరన్ మొదటిసారి మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే తాను ఎప్పుడు రఘువరన్ తోనే ఉండేవాడినని.. అన్నయ్య చనిపోయిన రోజు తాను బెంగళూరులో ఉన్నానని.. ఆరోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారని అయితే అప్పటికే అన్నయ్య చనిపోయారని వైద్యులు తెలిపినట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. అయితే అన్నయ్య మరణానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. రఘువరన్ శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయారు.

తన కొడుకును చాలా ప్రేమించాడు. అన్నయ్య రోహిణి వేరువేరుగా ఉండడంతో వారంలో శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చే అవకాశం అన్నయ్యకు ఉండేది. ఆదివారం తిరిగి మళ్లీ వాళ్లు తీసుకుపోతారు. అది కోర్టు నిబంధన.. కొడుకు రాగానే నాన్న అని పిలవగానే రఘువరన్ అన్నయ్య కన్నీరు పెట్టేవాడు.. ఇక ఎప్పుడైతే కుమారుడు తిరిగి వెళ్ళిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడు. అందుకే మధ్యానికి బానిస అయ్యాడు.. ఒకరకంగా అన్నయ్య ఇలా కావడానికి కారణం ఆయన భార్య రోహిణి అంటూ రఘువరన్ సోదరుడు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version