సౌత్ సినిమాలను చూసి బాలీవుడ్ భయపడుతోంది: మనోజ్ బాజ్ పాయ్

-

సౌత్ సినిమాలు బాలీవుడ్ కు ధమ్కీ ఇస్తున్నాయి. బాహుబలితో ప్రారంభం అయిన దక్షిణాది సినిమా దండయాత్ర కేజీఎఫ్ 2తో కొనసాగుతోంది. బాలీవుడ్ ను కాదని సౌత్ సినిమాలకు అట్రాక్ట్ అవుతున్నారు నార్త్ పీపుల్. కరోనా తరువాత ఒక్కటంటే ఒక్క బాలీవుడ్ సినిమా సౌత్ సినిమాకు  పోటీ ఇవ్వలేకపోయింది. ఇదిలా ఉంటే సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవుతోంది. దీంతో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు, నటుల్లో ఒకరకంగా అసహనం పెరుగుతోంది. చివరకు అక్కడి మీడియా, క్రిటిక్స్ కూడా బాలీవుడ్ సినిమాలను విమర్శిస్తున్నారు. 

తాజాగా ఫ్యామిలీమెన్ హీరో మనోజ్ బాజ్ పాయ్ సౌత్ సినిమాలను ప్రశంసించారు. పుష్ప, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాల సక్సెస్ దర్శక, నిర్మాతలకు వణుకు పుట్టిస్తున్నాయిని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ వ్యాఖ్యానించాు. సౌత్ వాళ్లు సినిమా పట్ల ఇష్టం చూపిస్తారని.. తీసే ప్రతీ సీన్ కూడా ప్రపంచంలోనే బెస్ట్ సీన్ గా ఉండాలన్న తపనతో తీస్తారని ఆయన అన్నారు. ఈ అంకిత భావం హిందీలో లేదని ఆయన అన్నారు. తప్పకుండా సౌత్ మూవీస్ నుంచి బాలీవుడ్ మెళకువలను నేర్చుకోవాలని అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news