పాపం సురేందర్ రెడ్డి కి ఝలక్ అదిరింది ..?

-

టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ అని సురేందర్ రెడ్డి కి పేరున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రాం తో అతనొక్కడే సినిమా తెరకెకించాడు సురేందర్ రెడ్డి. అదే సూరి మొదటి సినిమా. ఆ సినిమాతో ఇక సూరి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత. అశోక్, ఊసరవెల్లి, కిక్, రేసు గుర్రం, ధృవ, సైరా సినిమాలతో బ్లాక్ బస్టర్ సినిమాలని అందుకున్నాడు. ముఖ్యంగా సూరి కి సైరా చాలా ప్రత్యేకం అని చెపాలి. చాలా తక్కువ సినిమాలు చేసిన సూరి కి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం గొప్ప విషయం. ఆ అవకాశాన్ని 100 కి 100 శాతం వినియోగించుకొని సక్సస్ అయ్యాడు. అయితే చిక్కల్లా వచ్చింది సైరా తర్వాతే.

 

 

సైరా తర్వాత ప్రభాస్, మహేష్ బాబు లతో సినిమా అని ఊరించాడు సూరి. కానీ ఆ ఇద్దరు ఇప్పుడప్పుడే సూరికి డేట్స్ సర్ధుబాటు చేసే సీన్ లేదని అర్థమైపోయింది. వాస్తవంగా సూరి మహేష్ కోసం చాలా ఆశపడ్డాడు. కానీ ఎందుకో సూరి టైం బాగోలేదనిపిస్తుంది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా అక్కినేని అఖిల్ తో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తాజా సమాచారం. ఇంకా ఈ సినిమాని నిర్మించేది మైత్రీమూవీస్ వాళ్ళా ..! లేక నిరంజన్ రెడ్డినా? అన్నది తేలాల్సి వుందని తెలుస్తోంది. అయితే సురేందర్ రెడ్డి మాత్రం మైత్రీ మూవీస్ వైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో క్లారిటీ వస్తే సూరి అఖిల్ ప్రాజెక్ట్ కి సంబధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ దాదాపు పూర్తయిందట. ఇక సెకండాఫ్ షెడ్యూల్స్ జరగాల్సి ఉంది. ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే ఏప్రియల్ లో సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ రెండు నెలల్లో సినిమా కంప్లిటవుతుందా అన్నది కాస్త అనుమానమే. ఏదేమైనా సూరి ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు హిట్ అనే పదం వినపడని అఖిల్ తో కమిటయ్యాడని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news