2020 సంక్రాంతికి హెవీ కాంపిటిషన్.. థియేటర్లు దొరుకుతాయా?

-

ఈసారి సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, రజినీ కాంత్ ఉన్నారు. నలుగురు స్టార్లే. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువ కాదు. మరి.. నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్లు దొరుకుతాయా? కాంపిటిషన్ ఎలా ఉండబోతోంది.. అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

సంక్రాంతి.. ఆంధ్రా ప్రజలకు అదే పెద్ద పండుగ. అందుకే… ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రా ప్రజలంతా సంక్రాంతికి తమ ఊళ్లకు పయనమవుతారు. ఓ వారం రోజులు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ ఊళ్లో ఎంజాయ్ చేస్తారు. బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. అందుకే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఖచ్చితంగా సంక్రాంతికి కొందరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే.. ఒకరు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలయితే పెద్ద సమస్య ఉండదు కానీ.. ఈసారి సంక్రాంతికి హెవీ కాంపిటిషన్ ఉంటుంది.

ఎందుకంటే.. ఈసారి సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, రజినీ కాంత్ ఉన్నారు. నలుగురు స్టార్లే. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువ కాదు. మరి.. నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్లు దొరుకుతాయా? కాంపిటిషన్ ఎలా ఉండబోతోంది.. అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

సరిలేరు నీకెవ్వరుగా వస్తున్న మహేశ్

మహేశ్ బాబు కూడా ఈసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మహేశ్ ఇప్పటికే మహర్షి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 2 సక్సెస్ తర్వాత మహేశ్ తో తొలిసారిగా జతకడుతున్నాడు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబోలో

రాజకీయాల నుంచి కాస్త విరామం దొరికాక.. బాలకృష్ణ ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి బరిలో దిగే బాలయ్య.. ఈసారి కూడా బరిలో దిగబోతున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. అది వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందట. వీళ్ల కాంబోలో ఇప్పటికే జైసింహా సినిమా వచ్చింది.

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నా పేరు సూర్య సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో బన్నీ కాస్త ఆచీతుచీ అడుగులేస్తున్నాడు. అందుకే.. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభం అయింది. దసరాకు రిలీజ్ కూడా చేద్దామనుకున్నారు కానీ.. దసరాకు సైరా వస్తుండటంతో బన్నీ ఆ సినిమా విడుదల ఆపి.. సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ యూనిట్ కు చెప్పాడట. దీంతో బన్నీ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది.

దర్బార్ లో రజినీ

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈసారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి తమిళం నుంచి ఏదో ఒక సినిమా డబ్బింగ్ అవుతూనే ఉంటుంది. అయితే.. ఈసారి మాత్రం రజినీయే బరిలో దిగారు. మొన్న సంక్రాంతి బరిలో దిగిన పేటా సక్సెస్ కావడంతో రజినీ అదే సెంటిమెంట్ తో దర్బార్ ను కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో నయనతార హీరోయిన్.

Read more RELATED
Recommended to you

Latest news