బ‌న్నీ త‌దుప‌రి సినిమా.. సీన్ రివ‌ర్స్ అయ్యింది..

-

దాదాపు ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇది ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. జూన్ 4 నుంచి రెండో షెడ్యూల్‌ని జ‌రుపుకోబోతుంది. దాదాపు ముప్పై రోజులు పాటు ఈ షెడ్యూల్ జ‌రుగ‌నుంది. బ‌న్నీతోపాటు ప్ర‌ధాన తారాగ‌ణం న‌టించ‌నుంది. ఈ సారి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ని హైలెట్ చేస్తూ.. సిస్టర్ సెంటిమెంట్ కి సంబంధించి సీక్వెన్స్ కి ద‌ర్శ‌కుడు ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టు తెలుస్తంది. సిస్టర్ సెంటిమెంట్ అంటే రెండు ఎమోషనల్ సీన్స్, నాలుగు డెప్త్ డైలాగ్ లతో చెల్లి సెంటిమెంట్ ను పండించడం కాకుండా.. సంఘ‌ట‌న‌ల రూపంలో మొత్తం కథే చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా త్రివిక్రమ్ కథ రాశాడని తెలుస్తోంది. మ‌రోవైపు తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, భావోద్వేగాలకి కూడా ప్రాధాన్య‌తనిచ్చిన‌ట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. డీజే త‌ర్వాత బ‌న్నీ, పూజా క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది కావ‌డం విశేషం. అలాగే సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాని అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ క‌లిసి నిర్మిస్తున్నారు. దీనికి ‘అలకనంద’ అనే టైటిల్‌ వినిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమాలు వ‌చ్చి చాలా కాలం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అందుకే ఇటీవల తన పుట్టిన రోజుని పురస్కరించుకుని వరుసగా బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు ప్రాజెక్ట్‌లని ప్రకటించారు. దీంతో తనకు వచ్చిన గ్యాప్‌ని భర్తీ చేయాలని, వరుసగా ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయాలని భావిస్తున్నారట.

బన్నీ దీంతోపాటు సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నారు. వ‌చ్చే నెల‌లో సుకుమార్ సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. సుకుమార్ సినిమా స్థానంలో వేణు శ్రీరామ్ మూవీ త్వ‌ర‌గా ప్రారంభం కాబోతుంద‌ట‌. జూన్‌లోనే ఈ సినిమాని ప్రారంభించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. సుకుమార్ స్ర్కిప్ట్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాలేని ప‌క్షంలో ఐకాన్‌లో న‌టించేందుకు బ‌న్నీ సిద్ధ‌మ‌య్యార‌ట‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే సినిమాని వ‌చ్చే సంక్రాంతికి, వేణు శ్రీరామ్ సినిమాని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. వేణు శ్రీరామ్ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత సుకుమార్ సినిమా పట్ట‌లెక్క‌నుంది. ఇందులో క‌థానాయిక‌గా రష్మిక మందన్నా ఇప్ప‌టికే ఫైన‌ల్ అయ్యంది. ఇది వ‌చ్చే ఏడాది ఎండింగ్‌లోగానీ, 2021 సంక్రాంతికిగానీ రిలీజ్ కానుంద‌ట‌. ఇలా వ‌చ్చే సంక్రాంతి నుంచి బ‌న్నీ సంద‌డి మొద‌ల‌వుతుంద‌ని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news