మహర్షి మూడు గంటలు వాయిస్తాడట..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్దె నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. మే 9న గ్రాండ్ గా రిలీజ్ అవనున్న ఈ సినిమా రన్ టైం పై ప్రస్తుతం ఓ న్యూస్ బయటకు వచ్చింది.

నాలుగు గంటలు ఉన్న సినిమాను మూడు గంటల 20 నిమిషాలకు కట్ చేశారట. ఎడిటెడ్ వర్షన్ అంత వచ్చిందట. ఇప్పుడు దాన్ని మూడు గంటలకు కుదించేలా ప్రయత్నాలు చేస్తున్నారట. అంటే ఎలా లేదన్నా మహర్షి 3 గంటలు ఉండటం కన్ఫాం. లాస్ట్ ఇయర్ రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు దాదాపు 3 గంటలు ఉన్నా ప్రేక్షకులు ఆదరించారు. అయితే మహర్షి కూడా 3 గంటల పాటు ప్రేక్షకులను కూర్చోపెడతాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news