ముద్దుగా బొద్దుగా ఉండే ఈ హీరోయిన్లు.. మరీ అంతలా సన్నబడిపోయారు.. ఎవరెవరంటే?

-

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు మనగలగాలంటే అందంగా ఉండటంతో పాటు తమ ఫిగర్ ను కూడా మెయింటేన్ చేస్తుండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ లావు అయిపోతే దర్శక నిర్మాతలు వారిని తమ సినిమాల్లో నటించాలని అడగడానికి భయపడిపోతారు. క్యారెక్టర్ కు అవసరమైతే వెయిట్ గెయిన్ కావచ్చు. కానీ, వెయిట్ లాస్ కావడం అనేది కొంచెం కష్టం. కాగా ఈ హీరోయిన్లు ఒకప్పుడు చాలా ముద్దుగా బొద్దుగా ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు మాత్రం సన్నబడిపోయారు. అసలు వాళ్లేనా అనేంతలా మారిపోయారు.

అంతలా వీరు వెయిట్ లాస్ అవడం ఎలా జరిగింది? మరీ ఇంత సన్నబడ్డారేంటని కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికి అస్సలు పోలిక అనేది లేదని అంటున్నారు. ఎండు చేపల్లా అయ్యారని పేర్కొంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇంతకీ వెయిట్ బాగా లాస్ అయిన ఆ హీరోయిన్లు ఎవరెవరంటే..రాశిఖన్నా, శాలిని పాండే, అనుపమా పరమేశ్వరన్.

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ..తన నటనతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ భామ..సడెన్ గా బాగా వెయిట్ లాస్ అయిపోయింది. అసలు అలా ఎలా వెయిట్ కాగలరు? అనే ప్రశ్న వచ్చేంతలాగా ఆమె వెయిట్ లాస్ అయింది. ఈ భామ నటించిన ‘పక్కా కమర్షియల్’ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

అనుపమా పరమేశ్వరన్ విషయానికొస్తే..ఈమె కూడా కొంచెం బొద్దుగానే ఉండేది. కానీ, తర్వాత కాలంలో వెయిట్ లాస్ అయిపోయింది. వెయిట్ లాస్ అయిన నేపథ్యంలో మునుపటి స్టైలిష్ లుక్ ను అనుపమ కోల్పోయింది. ఇక శాలిని పాండే విషయానికొస్తే..ఈమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి ’ పిక్చర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో బొద్దుగా కనిపించింది. కాగా, ఇటీవల కాలంలో ఈ సుందరి చాలా సన్నబడిపోయింది. ఈ భామ నెటిజన్లు, అభిమానులు అందరూ షాక్ అయ్యే రేంజ్ లో సన్నబడిపోయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news