వాస్తు: మానసిక ప్రశాంతత మొదలు సమస్యలు అన్నీ దూరం అవ్వాలంటే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. ప్రతి ఒక్కరు ఈ మధ్య వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. మన పూర్వీకులు రుద్రాక్షలు ని వేసుకోవడం మనం చూస్తున్నాం.

రుద్రాక్ష వలన చాలా ఉపయోగాలు వున్నాయి. ఇది మనసుకి ప్రశాంతతను ఇస్తుంది. అలానే రుద్రాక్షలు మనసుని శాంతింప చేస్తాయి. రుద్రాక్షలను వేసుకోవడం వలన హై బీపీ తగ్గుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రుద్రాక్ష మొక్క ని ఇంటి దగ్గర నాటితే చెడు కళ్ళు దిష్టి పడదు.

రుద్రాక్ష ఉంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది రుద్రాక్ష ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేసి దానిని ధరిస్తే చక్కటి ఫలితాలు పొందొచ్చు. రుద్రాక్షలను ఇంట్లో ఉంచడం కూడా ఎంతో మంచిది. ఇంట్లో రుద్రాక్ష చెట్టును పెంచాలంటే గార్డెన్ లోని ఈశాన్య వైపు కి పెంచడం మంచిది ఇది పాజిటివ్ గా ఎనర్జీ ని కలిగిస్తుంది. దైవానుగ్రహం కూడా లభిస్తుంది.

వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణేశ రుద్రాక్ష ని ప్రతిష్టిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఏ బాధ ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version