కరీంనగర్ : ఆస్తి పంపకాల విషయం లో గొడవ తండ్రి పై కొడుకు దాడి

-

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన గర్వాంద మల్లయ్య పై కొడుకు రాజన్న పారతో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు మల్లయ్య తనకున్న 4 ఎకరాల పొలాన్ని కొడుకులకు ఇచ్చి ఎకరం భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భూపంపకాలు, డబ్బుల గురించి సోమవారం గొడవ జరగగా తండ్రి మల్లయ్యపై పారతో దాడి చేశాడు. బాధితుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Read more RELATED
Recommended to you

Exit mobile version