వరంగల్ : త్వరలో కేంద్ర పురావస్తు శాఖలోకి ఆ కట్టడాలు..!

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు చారిత్రాత్మక కట్టడాలు త్వరలో కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి. వరంగల్ జిల్లా ధర్మరావుపేటలోని శివాలయం, హన్మకొండ జిల్లా ముప్పారంలోని త్రికుటాలయం, భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుట్టలు, ములుగు జిల్లాలో దామరవాయి సమాధులను కేంద్ర పురావస్తు శాఖ తన పరిధిలోకి చేర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. ఆయా కట్టడాల అభివృద్ధికి అడుగులు పడే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news