బిల్లు కడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా సచిన్ (27) అనే యువకుడికి గుండెపోటు వచ్చింది.
దీంతో ఉన్నట్టుండి కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే, యంగ్ ఏజ్లో గుండెపోటు మరణాలు పెరుగుతుండటం యువభారతాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.
https://twitter.com/ChotaNewsApp/status/1898048498697724015