ఖాళీగా వున్న 400 సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులు.. వీళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు..!

-

మీరు ఉద్యోగం కోసం చూసున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్‌ లో సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేశారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ ఖాళీలని భర్తీ చేయనుంది.

మొత్తం 400 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూస్తే.. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2019, 2020, 2021/ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 పరీక్ష ప్యాస్ అయ్యి ఉండాలి.

స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టు కి ఎంపిక అయితే నెలకు రూ. 15,000 స్టైపెండ్‌గా ఇస్తారు. అప్లై చేసుకోవడానికి 14-01-2023 చివరి తేదీ. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలను http://aaiclas.aero/career లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news