MAT-2022 నోటిఫికేషన్ విడుదల

-

దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)-2022 నోటిఫికేషన్‌ను ఏఐఎంఏ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీఏ, పీజీడీఎం తదితర ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. మ్యాట్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఏదైనా ఒకదాన్ని లేదా రెండింటిని ఎంపిక చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సర పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.

పీబీటీ, సీబీటీ మొదటి షెడ్యూల్
– ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 9
– అడ్మిట్ కార్డుల డౌన్‌లోడింగ్: మే 11 నుంచి
– పీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
– సీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
– టెస్టుల తేదీ: మే 15

పీబీటీ, సీబీటీ రెండో షెడ్యూల్
– ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 23
– అడ్మిట్ కార్డుల డౌన్‌లోడింగ్: మే 25 నుంచి
– పీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
– సీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
– టెస్టుల తేదీ: మే 28

వెబ్‌సైట్: mat.aima.in

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news