గుడ్ న్యూస్.. 287 కానిస్టేబుల్‌ పోస్టులు.. ఇలా అప్లై చేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇది చక్కటి అవకాశం. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దీనిలో 287 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక పోస్టుల వివరాలని చూస్తే.. కానిస్టేబుల్ (టైలర్, గార్డెనర్, కోబ్లర్‌) పోస్టులు 65, కానిస్టేబుల్ (సఫాయి కరంచారీ, వాషర్‌మన్, బార్బర్) పోస్టులు 222 ఉన్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక అర్హత వివరాలని చూస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఐటీఐ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి.

ఇక చివరి తేదీ విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు , డిసెంబర్‌ 22, 2022 చివరి తేదీ. పరీక్ష ఫీజు అయితే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు గా చెల్లించాల్సి వుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేయాలని అనుకునే వారు https://itbpolice.nic.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news