బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌: హీరో నుంచి జీరో అయ్యారు..

-

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఏకంగా 105 రోజులుగా ఎంట‌ర్టైన్ చేస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 3 నేటి ఆదివారంతో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఫైన‌ల్స్‌కు చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్ల‌లో శ్రీముఖి – రాహుల్ మ‌ధ్య టైటిల్ కోసం ఫైట్ న‌డుస్తోంద‌ని అంటున్నారు. బ‌య‌ట ట్రెండింగ్స్ ప్ర‌కారం రాహుల్ సిప్లింగంజ్‌కే ఎక్కువ ఓట్లు పోల‌వ్వడంతో అత‌డే బిగ్‌బాస్ 3 విన్న‌ర్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ హౌస్‌లో ముందు నుంచి హీరోలుగా ఉన్న వారు చివ‌ర‌కు జీరోలు అయ్యారు.

అలా జీరోలు అయిన వారిలో హీరో వ‌రుణ్ సందేశ్‌తో పాటు అలీ రెజా ఉన్నారు. అసలు షో స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి వ‌రుణ్ చాలా కూల్‌గా గేమ్ ఆడుతూ వ‌చ్చాడు. అందులోనూ హీరో స్టేట‌స్ ఉండ‌డంతో చాలాసార్లు నామినేట్ అయినా సులువుగానే గ‌ట్టెక్కేశాడు. పైగా భార్య వితిక కూడా ఉండడంతో వారిద్ద‌రి ప్రేమాయ‌ణం కూడా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. హౌస్‌లో టాస్క్‌ల ప‌రంగా వీక్‌గా ఉన్నా అత‌డి కూల్‌నెస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది.

చాలా వారాల వ‌ర‌కు అత‌డు ఖ‌చ్చితంగా బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతాడ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే చివ‌ర్లో వితిక‌ను చివ‌రి వ‌ర‌కు హౌస్‌లో ఉంచాల‌ని అత‌డు ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లు పెట్టాడో… త‌ను నా భార్య కాబట్టే ఆమెను ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పిస్తున్నాన‌ని శివ‌జ్యోతితో గొడ‌వ పెట్టుకున్నాడో అప్ప‌టి నుంచి అత‌డి ఓటింగ్ శాతం త‌గ్గిపోయింది. చివ‌ర‌కు చాంపియ‌న్ రేసులో పోటీ ఇచ్చే ప‌రిస్థితికి కూడా రాలేక‌పోయాడు.

ఇక అలీ రెజా టాస్క్‌ల‌తో దుమ్ము రేపేవాడు. ర‌వికృష్ణ‌, శివ‌జ్యోతితో ఓ టీం ఏర్పాటు చేసి చాలా రోజులు బాగానే నెట్టుకొచ్చాడు. అయితే త‌న అతి బిహేవియ‌ర్‌తో నామినేష‌న్లోకి వ‌చ్చిన తొలి వారం అంటే 50 రోజుల‌కే ఎలిమినేట్ అయ్యాడు. అయితే, వైల్డ్ కార్డ్ పేరుతో మళ్లీ వచ్చారు అలీ. కానీ, మొదటిసారి ఏ తప్పైతే చేశారో అదే తప్పు మళ్లీ చేసి.. ఓటింగ్ లో చిట్ట చివరికి పడిపోయారని తెలుస్తోంది. బిగ్ బాస్ లో అందరికంటే, తక్కువ ఓట్లు అలీ రేజాకే వచ్చినట్టు సమాచారం. ఏదేమైనా షో ముందు నుంచి హీరోలుగా ఉన్న ఈ ఇద్ద‌రు చివ‌ర‌కు జీరోలు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news