తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు

-

బాలారిష్టాలు దాటుకుంటూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ, ప్రత్యర్థుల కుయుక్తులను తిప్పికొడుతూ తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోవడం అత్యద్భుతమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి అడ్డంకును అవలీలగా దాటుకుంటూ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లుగా ప్రగతి ప్రస్థానంలో నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో.. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఆరు దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా నిలిపిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. అన్ని వృత్తులను, అందరి భాగస్వామ్యం, సహకారంతో, శాంతియుత పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియకు సహకరించిన వారందరికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version