4 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. భారత్ లో కలవరం..!

-

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడగా, వేల మంది మృతి చెందారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభణ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 13,586 మందికి కరోనా పాజిటివ్ గా తేలగా మరో 336 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,80,532కు చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 12,573కి పెరిగింది. అలాగే ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 2,04,710 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం1,63,248 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news