నేడు తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీర్‌ ఫలితాలు విడుదల.!

-

ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది.
మధ్యాహ్నం 3.30గంటలకు జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 9న ప్రారంభం కానుంది..నవంబర్‌ రెండో తేదీ వరకు రెండు విడుతల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. మిగతా సీట్లను కళాశాలలో భర్తీ చేసేందుకు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం నవంబర్‌ 4న మార్గదర్శకాలను ప్రవేశాల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి విద్యార్థులు సహాయం కేంద్రం ఎంచుకోవాలి. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు కేంద్రాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news