విజయవాడ ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ రవాణా… ఎండీ సీరియస్ !

-

ఈ మధ్య డ్రగ్స్ దందా దుమారం రేపుతున్న సంగతి విదితమే. నిత్యం డ్రగ్స్ సరఫరాపై వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇపుడు మరో డ్రగ్స్ కేస్ కలకలంగా మారింది. ఏపీలో విజయవాడ లోని ఆర్టీసి బస్సులో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమల రావ్ ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. డ్రగ్స్ సరఫరా పూర్తి వివరాలు వాటి లింక్ లు అన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తక్షణమే తీసుకోవాలని సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

ఇక ఆర్టీసి బస్సులో డ్రగ్స్ రవాణా వివరాల్లోకి వెళితే..డ్రగ్స్ ను అనధికరికంగా బస్సు డ్రైవర్ తరలించారని అధికారులు చెబుతున్నారు. ఈ అంశం పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామని డ్రగ్స్ రవాణాకు చెక్ పెట్టే విధంగా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని వారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news