విమానంలో ప్రయాణికురాలి సీటుపైనే పోసేశాడు..!

-

మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. పిచ్చి చేష్టలు చేశాడు. ఓ ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోశాడు. ఈ ఘటన ఎయిరిండియా విమానంలో చోటు చేసుకున్నది. ఆగస్టు 30 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. మద్యం తాగి విమానం ఎక్కిన ఓ వ్యక్తి విమానంలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. ఓ ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా విమానయాన శాఖకు ప్రయాణికురాలు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విమానయాన శాఖ ఎయిరిండియాను విచారణకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news