అక్కడ మహిళలు పురుషులతో కలిసి భోజనం చేయకూడదట..!

-

వామ్మో.. ఇవేం రూల్స్ రా బాబు అంటారు మీరు ఈ వార్త చదివాక. లేకపోతే ఏంది.. మహిళలు పురుషులతో కలిసి భోజనం చేయకూడదట. మరీ.. ఇటువంటి రూల్స్ కూడా ఉంటాయా? అని షాక్ అవకండి. ఉంటాయి. ఎక్కడ ఉన్నాయో కాస్త చెప్పండి బాబు.. అక్కడికి వెళ్లకుండా ఉంటాం అంటారా? అయితే.. మనం ఓసారి ఇండోనేషియా వెళ్లాల్సిందే.

ఇండోనేషియాలోని అసెహ్ అనే ప్రాంతంలో ఈ రూల్ ఉందట. అక్కడి రూల్ ప్రకారం మహిళలు పురుషలతో కలిసి ఏం తినకూడదు. వాళ్లు భర్త లేదంటే బంధువులతో మాత్రమే కలిసి రెస్టారెంట్లలో భోంచేయాలట. కనీసం ఆఫీసు కొలిగ్స్, ఫ్రెండ్స్ తో కూడా కలిసి రెస్టారెంట్లలో తినకూడదట. అసెహ్ లోని బిరూన్ జిల్లాలోనే ఈ రకమైన నిబంధన ఉందట. అంతే కాదు.. రాత్రి 9 దాటిన తర్వాత రెస్టారెంట్లు, కెఫెల్లోనూ ఒంటరి మహిళలను అనుమతించరట. ఇవేం రూల్స్ రా బాబోయ్..

Read more RELATED
Recommended to you

Latest news