ఎదిగే పిల్లలకు ఆహారంలో ఇవి పెడితే మతిమరుపు మాటే ఉండదు..

-

మతిమరుపు అనేది అలవాటు కాదు.. ఒక వ్యాధి.. ప్రతిదీ మర్చిపోతున్నారంటే.. వారిలో పోషకాహార లోపం ఉంది అని అర్థం.. అసలే బిజీలైఫ్‌స్టైల్‌లో ఇలాంటి ఒక వ్యాధి తోడైతే ఇంకా కష్టం అవుతుంది. మీకు ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి ఉందనిపిస్తే.. వెంటనే కొన్ని ఆహారాలకు అలవాటు పడితే జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చు. అవేంటంటే..

ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీరు సమృద్ధిగా తాగాలి. నీరు సరిపడా తాగితే ఆరోగ్యంతోపాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది.

జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణం టమాటాలకు ఉంటుంది. ఈ విషయం మీకు ఆశ్యర్యంగానే అనిపించవచ్చు. వీటిల్లోని ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.. టమాటా రోజూ తినేవారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడే మరో ఆహార పదార్థం ఉల్లి. దీనిలో ఆంథోసయనిన్, క్వెర్సెటిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటు ఉండదు. ఉల్లి ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది.

బీట్‌రూట్ బీట్‌రూట్ శరీరంలో రక్తం ఉత్పత్తికి మాత్రమే కాకుడా మెదడుకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయడంలో కూడా తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వారానికి రెండు మూడు సార్లు బీట్‌ రూస్‌ జ్యూస్‌ తాగిన అటు ఆరోగ్యం ఇటు అందం రెండు బాగుంటాయి.

జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడే వాటిల్లో గ్రీన్ టీ ఒకటి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా గ్రీన్‌టీ తాగితే మెదడు పనితీరు బాగుంటుంది.

డ్రైఫ్రూట్స్ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష.. వంటి ఆహార పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఈ ఆమ్లాలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్స్‌ పనితీరును పెంచుతాయి. మెదడులోని రక్తనాళాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ని సరఫరా చేయడంలోనూ ఇవి తోడ్పడతాయి. వీటిల్లోని విటమిన్ బి6, మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు ఆరోగ్యానికే కాకుండా మెదడు చురుగ్గా పని చేయడంలోనూ సహాయపడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం ఆలోచనాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పొటాషియంతోపాటు మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ, కె వంటి పోషకాలు మెదడుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడతాయి.

పసుపు ఔషాదాల గని.. దీనిలోని కర్క్యుమిన్ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయ పడుతుంది. గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యంతోపాటు, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఎదిగేపిల్లలకు పెట్టే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే వారి మెదడు షార్ప్‌గా ఉంటుంది. మతిమరుపు సమస్యే ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news