త్వ‌ర‌లో ఒకే వేదిక‌పై క‌నిపించ‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, విరాట్ కోహ్లి.. ఎందుకో తెలుసా..?

-

మ‌న దేశంలో నిత్యం రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల ఎంతో మంది చనిపోతున్న విష‌యం విదిత‌మే. వారిలో ఎక్కువ‌గా మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డ‌పడం వ‌ల్లే ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు.

ఒక‌రు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర‌హీరోగా వెలుగొందుతున్న న‌టుడు.. మ‌రొక‌రు క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా దూసుకెళ్తున్న ఆట‌గాడు.. వీరిద్ద‌రూ క‌ల‌సి త్వ‌ర‌లో ఒకే తెర‌ను పంచుకోనున్నారు. ఏమిటీ.. అర్థం కాలేదా.. అదేనండీ.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర హీరోగా దూసుకెళ్తున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, క్రికెట్ లో నంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మ‌న్‌గా ఉన్న విరాట్ కోహ్లిల గురించే మేం చెబుతోంది. వీరిద్ద‌రూ క‌లిసి త్వ‌ర‌లో ఒకే వేదిక‌పైకి రానున్నారు. అయితే అదేదో ప్రొడ‌క్ట్‌ యాడ్ షూటింగ్ కోసం కాదు.. ఓ సామాజిక బాధ్య‌త కోసం..!

మ‌న దేశంలో నిత్యం రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల ఎంతో మంది చనిపోతున్న విష‌యం విదిత‌మే. వారిలో ఎక్కువ‌గా మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డ‌పడం వ‌ల్లే ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్ర‌మాదాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం త్వ‌ర‌లో ఓ చిన్నపాటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించనున్నారు. ఓ ప్ర‌ముఖ జాతీయ చాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నుంది.

అయితే ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా తీయ‌నున్న ఓ యాడ్‌లో జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, విరాట్ కోహ్లిలు క‌లిసి న‌టించ‌నున్నార‌ట‌. దేశంలో నిత్యం జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించేలా ఆ యాడ్‌ను తీయ‌నున్నారు. మరి ఆ యాడ్ ఎప్పుడు ప్ర‌సారం అవుతుందో చూడాలి. అయితే జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఎప్పుడూ.. త‌న సినిమాల ఆడియో ఫంక్ష‌న్ల‌కి వ‌చ్చే అభిమానుల‌ను జాగ్ర‌త్త‌గా ఇంటికి వెళ్లాల‌ని సూచిస్తుంటాడు క‌దా.. అందుక‌నే అత‌ను ఇప్పుడు ఈ యాడ్‌లో న‌టించ‌నున్నాడు. ఇక వీరిద్ద‌రే కాకుండా మ‌రో 5 మంది సెల‌బ్రిటీలు.. మొత్తం 7 మంది క‌లిసి ఆ యాడ్‌లో న‌టిస్తార‌ని తెలిసింది..!

Read more RELATED
Recommended to you

Latest news