విరాట్‌ కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా..?

-

విరాట్‌ కోహ్లీ.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. క్రికెట్‌ ప్రపంచంలో ఒక సంచలనం.. సాధరణంగా ఏ క్రికటర్‌కు అయినా.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రమే ఉంటారు.. కానీ విరాట్‌ కోహ్లీకి మాత్రం..క్రికెట్‌ అంటే తెలియని వాళ్లు కూడా ఫ్యాన్స్‌ ఉంటారు. హీరోలు, హీరోయిన్స్‌ అందరూ కింగ్‌కు అభిమానులే.. అయితే.. విరాట్‌ కోహ్లీ తాగే వాటర్‌ గురించి గతంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు అందరూ షాక్‌ అయ్యారు. కోహ్లీ ఫిట్ నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. విరాట్‌ తినే బియ్యం కాస్ట్‌ ఎంతో మీకు తెలుసా..?

 

భారత మాజీ కెప్టెన్ , రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ గురించి ఎప్పుడూ కష్షపడుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీ పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి చపాతీలు తినడు. వాటికి దూరంగా ఉంటాడు. విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోడు. ఇది శరీరం కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ మాత్రమే తింటాడు.

స్పెషల్‌ రైస్‌..

కోహ్లీ మామూలు అన్నం కాకుండా స్పెషల్ రైస్ తింటారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. గ్లూటెన్ రహితంగా ,కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఈ బియ్యం సాధారణ రుచిని కలిగి ఉంటుంది. ఈ బియ్యం కిలో ధర రూ.400 నుంచి 500 వరకు ఉంటుందని సమాచారం. తాను పాల ఉత్పత్తులు తినడం పూర్తిగా మానేశానని తెలిపాడు. తాను గోధుమలతో చేసిన రొట్టెలను కూడా తిననని కోహ్లీ తెలిపాడు.

ఫిట్‌గా ఉండటం కోసం.. తాను చాలా స్వీట్లు కూడా తినడం మానేశానని తెలిపారు. 34 ఏళ్ల వయసులో కూడా కోహ్లి చాలా ఫిట్‌గా, బాగానే మెంటైన్ చేస్తున్నాడు.

కోహ్లికి చాలా ఇష్టమైన ఫుడ్స్‌లో చోలే బట్టర్ ఒకటి. అయితే తన ఆటపై, తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించే కోహ్లి.. చోలే బట్టర్ తినడం కూడా తగ్గించారట.. అలాగే.. అల్పాహారం గురించి మాట్లాడుతూ, కోహ్లీ రోజును మూడు గుడ్డులు, ఒక గుడ్డుతో కూడిన ఆమ్లెట్‌తో ప్రారంభిస్తాడట.. అలాగే భోజనంలో ఉడికించిన చికెన్, మెత్తని బంగాళదుంపలు, బచ్చలికూర మరియు కూరగాయలను తింటాడు. మొత్తానికి కింగ్‌ తన డైట్‌ను ఇలా మెయింటేన్‌ చేస్తున్నాడు..

Read more RELATED
Recommended to you

Latest news