ఇండియ‌న్ క్రికెట్ ప్లేయ‌ర్ల‌లో ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఎవ‌రు బాగా ఆడుతారో తెలుసా..?

-

తెలుగు సినీ హీరో నిఖిల్ త‌న సినిమాల‌ను ప్ర‌చారం చేసుకునేందుకు గాను గ‌తంలో ప‌బ్‌జి మొబైల్ ఆడాడు గుర్తుంది క‌దా. అయితే కేవ‌లం నిఖిల్ మాత్ర‌మే కాదు, ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడే సెల‌బ్రిటీలు ఇంకా చాలామందే ఉన్నారు.

ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌.. ప‌బ్‌జి.. ఎలా పిలిచినా ఇప్పుడీ గేమ్ ఎంత పాపుల‌ర్ అయిందో మ‌నంద‌రికీ తెలుసు. ముఖ్యంగా ప్ర‌పంచంలోని చాలా దేశాల క‌న్నా మ‌న దేశంలోనే ప‌బ్‌జి ఆడే వారి సంఖ్య గ‌తేడాదిలో బాగా పెరిగింది. ప‌బ్‌జిలో మొబైల్ వెర్ష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ గేమ్‌ను ఆడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడీ గేమ్‌ను బ్యాన్ చేయాల‌ని స‌ర్వ‌త్రా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం అటుంచితే.. ప‌బ్‌జి గురించిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తాజాగా తెలిసింది. అదేమిటంటే…

తెలుగు సినీ హీరో నిఖిల్ త‌న సినిమాల‌ను ప్ర‌చారం చేసుకునేందుకు గాను గ‌తంలో ప‌బ్‌జి మొబైల్ ఆడాడు గుర్తుంది క‌దా. అయితే కేవ‌లం నిఖిల్ మాత్ర‌మే కాదు, ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడే సెల‌బ్రిటీలు ఇంకా చాలామందే ఉన్నారు. వారిలో ఇండియ‌న్ క్రికెట్ టీం ప్లేయర్లు కూడా ఉండ‌డం విశేషం. మ‌రి వారు ఎవ‌రో తెలుసా..? ఇంకెవ‌రు.. మిస్ట‌ర్ కూల్ ధోనీ, మ‌నీష్ పాండే, య‌జువేంద్ర చాహ‌ల్‌, కేదార్ జాద‌వ్‌లే. వీరు ప‌బ్‌జిలో అలాంటి ఇలాంటి ప్లేయ‌ర్స్ కాదు, ఏస్ టైర్ ప్లేయ‌ర్స్‌. అవును, నిజమే.

పైన చిత్రంలో చూశారు క‌దా.. టీమిండియా క్రికెట్ ప్లేయ‌ర్లు అంద‌రూ ఫోన్లు, ఐప్యాడ్లు ప‌ట్టుకుని బిజీగా ఉన్నారు. అయితే వారంతా ఏం చేస్తున్నారో తెలుసా..? ఇంకేం చేస్తారు.. ప‌బ్‌జి ఆడుతున్నారు. అవును.. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరే ముందు ముంబైలో ఎయిర్‌పోర్టులో ఖాళీ స‌మ‌యం దొర‌క‌గానే అలా ప్లేయ‌ర్లు అంద‌రూ ప‌బ్‌జి మొబైల్ ఆట‌లో మునిగిపోయారు. అయితే ఇప్పుడీ విష‌యం ఎలా బ‌య‌టికి వ‌చ్చింది అంటారా..? ఏమీ లేదండీ.. టీమిండియా క్రికెట్ ప్లేయ‌ర్ కుల్‌దీప్ యాద‌వ్ ఆ వివ‌రాల‌ను తాజాగా ఓ ప్ర‌ముఖ క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. దీంతో అప్ప‌టి ఫొటో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా.. మ‌న‌మే కాదు, టీమిండియా క్రికెట‌ర్లు కూడా ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను అంత‌గా ఆడుతారంటే.. న‌మ్మ‌లేకుండా ఉన్నాం క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news