ఆ పావురాల పేరు మీద కోట్లల్లో ఆస్తులు ఉన్నాయట..!

-

మనం గతంలో కూడా కొన్ని వార్తలను చూశాం. కుక్కల పేరు మీద కోట్ల విలువైన ఆస్థులు ఉన్నాయి. బంగ్లాలు ఉన్నాయి అని. ఈ మధ్య కాలంలో కూడా ఈ తరహా న్యూస్ వింటూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు పావురాల వంతు అయింది. ఇప్పుడు చెప్పుకునే పావురాల పేరు మీద కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట. అవునండి మీరు విన్నది నిజమే. అసలు ఈ మూగజీవులకు ఆస్థులేంట్రా అనేగా మీ డౌట్. మీ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే..ఈ కథనం పూర్తిగా చదివేయాల్సిందే.
రాజస్థాన్‌లోని నాగౌర్‌ నగర పరిధిలోని జస్నాగర్‌ గ్రామంలో ఉండే పావురాల పేరు మీద 30ఎకరాలకు పైగా భూమి, 27 దుకాణాలు, బ్యాంకులో నగదు నిల్వలు ఉన్నాయట. వీటి విలువ కోట్లలో ఉంటుంది. అందుకే, గ్రామస్థులు ఈ పావురాలను మల్టీమిలియనీర్‌ పావురాలు అని పిలుస్తుంటారు. మనకు కూడా ఇన్నీ ఆస్తులు లేవుకదా అనిపిస్తుందా..

అసలు ఏం జరిగిందంటే..

నాలుగు దశాబ్దాల కిందట జస్నాగర్‌ గ్రామానికి సజ్జన్‌రాజ్‌ జైన్‌ అనే పారిశ్రామికవేత్త వచ్చి.. పావురాల సంరక్షణ కోసం ఇక్కడే కబుతరన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడట. అప్పటినుంచి ట్రస్టుతో కలిసి గ్రామ ప్రజలు కూడా పావురాల బాగోగులను చూడటం ప్రారంభించారు. మూగపక్షుల కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేయడం మంచి ఆలోచనగా భావించి చాలా మంది విరాళాలు కూడా ఇచ్చారట. అలా వచ్చిన డబ్బుతో పావురాల పేరు మీద అప్పట్లోనే దుకాణాలు, భూములు కొనుగోలు చేశారు. వాటి విలువ ఇప్పుడు రూ. కోట్లు పలుకుతోంది.
పావురాలకు చెందిన దుకాణాల ద్వారా ఇప్పుడు నెలకు రూ.80వేలకుపైగా అద్దె వస్తుందట. వ్యవసాయ భూముల్ని కూడా కౌలుకి ఇచ్చారు. బ్యాంకులో రూ.30లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంది. వీటన్నిటి ద్వారా వచ్చే ఆదాయంతో పావురాలకు ప్రతి రోజు ఆహారం, నీరు అందుబాటులో ఉండేలా ట్రస్టు ప్రతినిధులు చూసుకుంటారు. పావురాల పేరు మీద ఉన్న భూముల్లోని పది ఎకరాల్లో గోశాలలు ఏర్పాటు చేసి 500కుపైగా గోవుల్ని సంరక్షిస్తున్నారు. చాలా మంచి విషయం ఇది.. అంతేకాదు.. ఓ పశువుల ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు. పూర్వీకులు మొదలుపెట్టిన ఈ ట్రస్టును ఈరోజికి కొనసాగిస్తామని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. మంచి సంకల్పంతో మొదలుపెట్టిన కార్యానికి తరతరాలుగా కొనసాగించటం అనేది చాలా గొప్పవిషయం.

Read more RELATED
Recommended to you

Latest news