ఆయనపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేయించారు.. వైసీపీపై బిజెపి ఎమ్మెల్యే ఫైర్

-

ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు.వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదని అన్నారు.అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తుచేశారు. దొంగ కేసులు పెట్టడం వల్ల పాస్ పోర్టు రెన్యువల్ కూడా అవ్వక చాలా మంది ఇబ్బంది పడ్డారు అని తెలిపారు.ఇక, విశాఖను అక్రమాలకు అడ్డాగా గత ప్రభుత్వం మార్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు విశాఖ వస్తే.. గుండాయిజం చేయించారు.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయించారిన ఫైర్ అయ్యారు.

మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌.. విశాఖలో జనవాణి కార్యక్రమం పెడితే అక్కడికి రాకుండా అడ్డుకున్నారని ,వైసీపీ గూండాలతో విశాఖపట్నం నిండి పోయిందని ఆరోపించిన ఆయన.. అక్రమ కేసులు, దాడులపై హోంమంత్రి అనిత సమీక్ష చేయాలని సూచించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version