తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : వివేక్‌ వెంకటస్వామి

-

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని గురువారం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలు, ప్రజా వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వివేక్ వెంకటస్వామి.

Hyderabad Cricket Association, కల్వకుంట్ల కవితకు 'హైదరాబాద్ క్రికెట్  అసోషియేషన్' ప్రెసిడెంట్ పోస్ట్: వివేక్ - bjp leader vivek venkataswamy  allegations on kalvakuntla kavitha about hca ...

రాష్ట్రంలో త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు వివేక్ వెంకటస్వామి. గద్దెలు వద్ద పార్టీ జెండాలను నాయకులతో కలిసి వివేక్ వెంకటస్వామి ఎగుర వేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రమేష్, శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పుల్గం తిరుపతి, అశోక్ వర్ధన్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు కొయ్యల ఏమాజీ, శేషగిరి, తుకారం, విజయ్ కుమార్, భరత్, విష్ణు కళ్యాణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news