BRAKING : అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్‌

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఇవాళ మరోసారి టిడిపి ప్రజా ప్రతినిధులు సస్పెండయ్యారు. ఏకంగా పద కొండు మంది టీడీపీ పార్టీ సభ్యులను ఇవాళ సస్పెండ్ చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సభా కార్య క్రమాలకు అడ్డు పడుతున్నారని టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

రామ్మోహన్ రావు, సాంబశివరావు, సత్య ప్రసాద్, చిన రాజప్ప, అశోక్, అచ్చెన్నాయుడు, భవాని, రామకృష్ణ బాబు, వెంకట నాయుడు, రవి కుమార్, జోగేశ్వర్ రావు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. టీడీపీ పార్టీ సభ్యులకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌ విసిరారు.టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని… రేపు వారి జా తకాలు బయట పెడతానంటూ హెచ్చరించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్రైనింగ్‌ ఇచ్చి పంపారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news