ఏపీలో నేడు 3,509 క‌రోనా ప‌రీక్షలల్లో 2 పాజిటివ్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లోపే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ప్రతి రోజు 3,000 నుంచి 4,000 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హింస్తే.. సింగిల్ డిజిల్ లోనే క‌రోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు.

ఈ క‌రోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,509 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షలల్లో కేవ‌లం 2 క‌రోనా పాజిటివ్ కేసులు మాత్ర‌మే నిర్ధార‌ణ అయ్యాయి. అలాగే ఈ రోజు రాష్ట్రంలో 4 క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 41 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news