హైదరాబాద్ లో 336 కిలోల గంజాయి సీజ్… ఏడుగురు మహిళలు అరెస్ట్

-

భారీ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు నాంపల్లి రైల్వే పోలీసులు. ఈ సందర్భంగా మూడు కోట్లు విలువ చేసే.. 336 కేజీల గంజాయి సీజ్ చేసారు నాంపల్లి రైల్వే పోలీసులు. ఏసీ కోచ్ లో చిన్న చిన్న బ్యాగ్ లో గంజాయి పెట్టీ తరలిస్తోంది ఈ ముఠా. వైజాగ్ నుండి ముంబయి వెళ్లే LTT ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఈ గ్యాంగ్ పట్టుబడింది. ఇవాళ లింగంపల్లి లో నాంపల్లి రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే 24 లాగేజ్ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 67 లక్షల విలువ చేసే 336 కేజీల గంజాయి సీజ్ చేశారు నాంపల్లి రైల్వే పోలీసులు.

ఈ గంజాయిని అరకు నుండి ముంబయి తరలిస్తున్నట్లు నాంపల్లి రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఈ గ్యాంగ్ లో ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అరెస్ట్ అయ్యారు. అరకు చుట్టుపక్కన ఉన్న గ్రామాలలో గంజాయి పండించే వారి వద్ద గంజాయిని ఈ ముఠా విక్రయించింది. ఈ సందర్భంగా రైల్వే డిఎస్పీ హైదరాబాద్ అర్బన్ చంద్ర భాను మాట్లాడుతూ.. వైజాగ్ నుండి వచ్చే ట్రైన్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని.. ఈ నేపథ్యంలోనే.. ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news