ఆంధ్ర ప్ర‌దేశ్‌లో నేడు కొత్త‌గా 37 క‌రోనా కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ప్ర‌తి రోజు రాష్ట్రంలో క‌నిష్టంగా కరోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ నేటి క‌రోనా వైర‌స్ బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 37 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ రాష్ట్రంలో ఆదివారం 49 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

అంటే నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు 12 కేసులు త‌గ్గాయి. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 42 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 506 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 7,364 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,33,39,780 క‌రోనా శాంపిల్స్ ను టెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news