దారుణం : వృద్ధురాలిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం

-

తెలిసిన వ్యక్తే కదా అని క్యాబ్ ఎక్కితే.. 60 ఏళ్ళ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఒక మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మే 11 న జరిగింది. కాగా, సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 62 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంది. ఆమెను బంధువులు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు. ఈ క్రమంలో.. ఆమెకు ఇంటి దగ్గర క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె ఎక్కడికి వెళ్లాలన్న అదే క్యాబ్ లో వెళ్లేది. బాధితురాలు.. మే 11 న కన్నాట్ ప్రాంతానికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు చీకటిపడింది.

అప్పుడు క్యాబ్ డ్రైవర్ కారును నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను బలవంతంగా కారులో నుంచి బయటకు లాగి కిందపడేశాడు. ఆ తర్వాత.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతొో తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత.. ఆమెను రోడ్డుమీద తీసుకొచ్చి వదిలేసి పారిపోయాడు. ఈ క్రమంలో బాధితురాలు, తీవ్ర గాయాలపాలైన దశలో స్థానికులు ఆమెను గుర్తించారు. వెంటనే పోలసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version