తెలంగాణలో మరో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రియుడు

-

దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేమ, వైవాహిక సంబంధాల నేపథ్యంలో… మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని గొంతు కోసి చంపాడు ఓ యువకుడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ కార్పొరేషన్ యైటింక్లైయిన్ కాలనీ కెకె నగర్ లో చోటు చేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి తేలితే.. ప్రియురాలు గొడుగ అంజలిని గొంతుకోసి హత్య హత్య చేశాడు ప్రియుడు రాజు. ప్రియురాలు అంజలి డిగ్రీ చదువుతుండగా.. ప్రియుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత మూడు సంవత్సరాల నుండి వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. పెళ్లి కి నిరాకరించడమే హత్యకు కారణం అని చెబుతున్నారు స్థానికులు. ప్రియుడు రాజు అంటే.. ప్రియురాలు గొడుగ అంజలి ఇంట్లో అస్సలు ఇష్టం లేదంటూ.. స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు.. రక్తం మడుగులో ఉన్న ప్రియురాలు గొడుగ అంజలిని.. పోస్ట్ మార్టం కు పంపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం ప్రియుడు రాజు పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news