గుడ్‌న్యూస్: ఏపీ ఉద్యోగుల బదిలీపై కీలక నిర్ణయం

-

ఉద్యోగ బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 17వ తేదీలోపు బదిలీలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉద్యోగ బదిలీకి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల్లో సంతోషం నెలకొంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

సీఎం జగన్
సీఎం జగన్

ఈ బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతోంది. ఈ మేరకు నిషేధాన్ని సడలిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉద్యోగుల బదిలీలపై సీఎం జగన్ అధికారులతో సమావేశమయ్యారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉద్యోగ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త జిల్లాల ప్రకారం.. ఉద్యోగ బదిలీలు ఉండనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news