కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో గులాబీ ఎమ్మెల్యేల సమావేశం..

-

ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొద్ది సేపట్లో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్, మల్కాజిరిగి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి,ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో చంద్రబాబును కలవనున్నారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నగరానికి చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మల్లారెడ్డి తన మనుమరాలు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం.మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సైతం వారు పార్టీలో కొనసాగారు.కానీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారు తెలుగుదేశం పార్టీని వీడిని టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version