పొదల్లోకి లాకెళ్లి మైనర్‌ బాలికపై అత్యాచారం..

-

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించిన కామంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఎంతో మందికి శిక్షలు విధిస్తున్నాయి కోర్టుల. అయినప్పటికీ కామాంధుల వెన్నులో వణుకు పుట్టడం లేదు. తాజాగా.. ఢిల్లీ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో ఇద్ద‌రు హాక‌ర్ల‌ను అరెస్టు చేశారు. తిల‌క్ బ్రిడ్జ్ వ‌ద్ద ఉన్న రైల్వే ట్రాక్ స‌మీపంలోని పొద‌ల్లో అత్యాచారం జ‌రిగిన‌ట్లు తెలిపారు పోలీసులు. నిందితుల్ని హ‌ర్‌దీప్ న‌గ‌ర్ , రాహుల్‌గా గుర్తించారు. ఈ ఇద్ద‌రూ ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో వాట‌ర్ బాటిళ్లు అమ్ముతుంటారని పోలీసులు వెల్లడించారు. ఐపీసీ 376డీ కింద కేసును బుక్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ ఇద‌ర్నీ అరెస్టు చేసిన‌ట్లు రైల్వే పోలీసు ఆఫీస‌ర్ హ‌రేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. పోలీసు క‌థ‌నం ప్ర‌కారం.. గుజ‌రాత్‌కు చెందిన ఓ అమ్మాయి త‌న ఫ్రెండ్ దీప‌క్‌తో క‌లిసి ఢిల్లీ స్టేష‌న్‌కి వ‌చ్చింది.

Pakistan: 21-year-old US woman gang-raped by social media 'friends' -  Oneindia News

గుజ‌రాత్ వెళ్లేందుకు రైలు ఎక్కాల్సి స‌మ‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ అయ్యింది. అప్పుడు దీప‌క్ ఆమెను స్టేష‌న్‌లో వ‌దిలేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సెంట్ర‌ల్ ఫూట్ ఓవ‌ర్ బ్రిడ్జ్ మీద ఉన్న స‌మ‌యంలో అమ్మాయికి, దీప‌క్‌కు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. అయితే ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న హాక‌ర్లు ఇద్ద‌రూ ఆమెను క‌లిశారు. సోద‌రుడికి ఫోన్ కాల్ చేసేందుకు మొబైల్ ఇవ్వాల‌ని ఆ అమ్మాయి హాక‌ర్ల‌ను వేడుకున్న‌ది. రైలు దొరికేలా హెల్ప్‌ చేయాల‌ని ఆ అమ్మాయి వాళ్ల‌ను అడిగింది. అయితే మ‌రో స్టేష‌న్ వ‌ద్ద ట్రైన్ దొర‌కుతుంద‌ని చెప్పిన హాక‌ర్లు ఆ అమ్మాయిని తిల‌క్ బ్రిడ్జ్ వ‌ద్ద ఉన్న పొద‌ల్లోకి లాకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news