బిజెపికి షాక్.. కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి

-

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ఆ రాష్ట్రంలో కీలక నేత, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిజెపి పార్టీకి రాజీనామా చేసి.. సొంతంగా కొత్త పార్టీని ప్రకటించారు. గత కొంతకాలంగా బిజెపిపై అసంతృప్తితో ఉన్న జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి “కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ” ని ఆదివారం బెంగుళూరులోని తన నివాసంలో ప్రకటించారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు గాలి జనార్దన్ రెడ్డి. గంగావతి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. బిజెపితో తన బంధం ముగిసింది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా తన పార్టీని నిర్మిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news