సీఎం యోగి ని కలిసేందుకు 200 కి.మీలు పరిగెత్తుకు వచ్చిన పదేళ్ల చిన్నారి…

-

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కిలోమీటర్లు పరిగెత్తుకొచ్చింది ఓ పదేళ్ల బాలిక. అథ్లెట్ గా గొప్ప విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని తపనతో చిన్ననాటి నుండే కఠోర సాధన చేస్తున్న ఆ బాలికచిన్ననాటినుండే కఠోర సాధన చేస్తున్న ఆ బాలిక పేరు కాజల్.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని మందా ప్రాంతంలో కాజల్ కుటుంబం నివసిస్తుంది.గతేడాది నవంబర్లో అలహాబాద్ ఓ నిర్వహించిన ఇది రానిర్వహించిన ఇదిరా మారథాన్ లో పాల్గొన్న కాజల్.

 

 

అప్పుడే క్రీడల్లో తన భవిష్యత్తును నిర్దేశించుకుంది.అథ్లెట్ కావాలన్న తన కలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాసింది కాజల్.చిన్నారి కాజల్ నుంచి లేఖ అందుకున్న సీఎం యోగి..బాలికకు ఆహ్వానం పంపారు.తనని పరచుకునేందుకు లక్నో రావాలంటూ సీఎం యోగి చిన్నారి కాజల్ కు ప్రత్యుత్తరం రాశారు.దీంతో ఏప్రిల్ 10న ప్రయాగ్ రాజ్ లోని సివిల్ లైన్స్ నుంచి లక్నోకు రెండు వందల కిలోమీటర్లు కాలినడకన బయలు దేరింది కాజల్.ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఏప్రిల్ 15న లక్నో చేరుకున్న చిన్నారి సీఎం కార్యాలయం నుంచి వచ్చే పిలుపు కోసం వేచి చూసింది.

శనివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలుసుకున్న కాజల్, తన లేఖతన లేఖ పై వెంటనే స్పందించిన సీఎం కు కృతజ్ఞతలు తెలిపిందితన లేక పై వెంటనే స్పందించిన సీఎం కు కృతజ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ ఆమెను సన్మానించి, అథ్లెటిక్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు పూర్తిగా నిలిచారని ప్రశంసించారు.భవిష్యత్తులో చిన్నారి కాజల్ ఎన్నో విజయాలను సాధించాలని ప్రోత్సహించారు.

Read more RELATED
Recommended to you

Latest news