రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో చోరీ కేసులో ఈశ్వరి అనే మహిళ అరెస్ట్

-

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు దొంగతనానికి గురైనట్లు ఐశ్వర్య రజనీకాంత్ తేనంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో జరిగిన సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలను ఆమె ధరించినట్లు తెలిపారు. ఆ వివాహం తర్వాత వాటిని తాను బయటకు తీయలేదని తెలిపారు.

ఆ నగలను పోయేస్ గార్డెన్స్ లోని రజనీకాంత్ ఇంట్లోని లాకర్లో భద్రపరిచామని, కీ మాత్రం తన దగ్గరే ఉందని చెప్పారు. అయితే తాజాగా ఐశ్వర్య ఇంట్లో చోరీ కేసులో ఈశ్వరి అనే మహిళను అరెస్టు చేశారు పోలీసులు. కన్నేళ్లుగా ఐశ్వర్య ఇంట్లోనే పనిమనిషిగా పనిచేస్తుంది ఈశ్వరి. దొంగతనం చేసిన తర్వాత వాటిని అమ్మి బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు తేనాంపేట పోలీసులు. 60 సవరాల నగలుతో పాటు డైమండ్స్ సహా ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news