2024 లో గెలిచేది వైసీపీ … ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలకు గత ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలను దాదాపుగా నెరవేర్చింది అని చెప్పాలి. ఆ ధైర్యంతోనే ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని పనిని జగన్ ప్రభుత్వం చేస్తోంది. ప్రతి ఇంటికీ వైసీపీ నాయకులు వెళ్లి మా ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ? మేము తీసుకువచ్చిన పధకాలు అన్నీ మీకు అందుతున్నాయా అంటూ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు నెల్లూరు లో ఇంటింటికీ జగనన్న ప్రభుత్వం అన్న ప్రోగ్రాం లో భాగంగా తిరుగుతున్నారు. ఈ ప్రోగ్రాం అనంతరం మాట్లాడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. జగన్ సీఎం గా ఉంటేనే వారి బ్రతుకులు బాగుపడతాయి అని పూర్తిగా విశ్వసిస్తున్నారు.

మరో ఆరు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మా పార్టీని తప్పక గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రాబోయేది జగనన్న రాజ్యమే అంటూ ఎంపీ ధీమాను వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version