ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలకు గత ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలను దాదాపుగా నెరవేర్చింది అని చెప్పాలి. ఆ ధైర్యంతోనే ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని పనిని జగన్ ప్రభుత్వం చేస్తోంది. ప్రతి ఇంటికీ వైసీపీ నాయకులు వెళ్లి మా ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ? మేము తీసుకువచ్చిన పధకాలు అన్నీ మీకు అందుతున్నాయా అంటూ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు నెల్లూరు లో ఇంటింటికీ జగనన్న ప్రభుత్వం అన్న ప్రోగ్రాం లో భాగంగా తిరుగుతున్నారు. ఈ ప్రోగ్రాం అనంతరం మాట్లాడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. జగన్ సీఎం గా ఉంటేనే వారి బ్రతుకులు బాగుపడతాయి అని పూర్తిగా విశ్వసిస్తున్నారు.
2024 లో గెలిచేది వైసీపీ … ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
-