సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

-

ప్రభుత్వాలు ఎన్ని నియమనిబంధనలు పెట్టినప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం సేవించడం మరియు అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఉంది. ఈ ప్రమాదంలో ఏకంగా అయిదుగురు మృతి మృతి చెందారు.

accident
accident

ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం పూట చోటు చేసుకుంది ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చౌటకుర్ గ్రామంలో లో వేగంగా వస్తున్న లారీ కారు ఢీ కొట్టింది. దీంతో కార్ లో ఉన్న ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి నుంచి మెదక్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో ఐదు మంది చనిపోగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు మరియు ఆరు సంవత్సరాల చిన్నారి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో లో లారీ డ్రైవర్ తప్పిదం ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ఇక ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు… అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news