ఆదివాసీ మహిళను ఈడ్చుకెళ్లిన పోలీసులు..వీడియో వైరల్

-

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. చెట్లు నరకడం, పోడు వ్యవసాయం చేయడం ఆపాలని అధికారులు చెబుతూంటే.. ఆదివాసులు మాత్రం వినడం లేదు. తమకు అదే జీవన ఆధారమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆదివాసి మహిళపై దారుణంగా వ్యవహరించారు పోలీసులు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది. దీనిపై రేవంత్‌ రెడ్డి సంపందించారు. పోడు భూమి పోరుభూమిని తలపిస్తోందని… మంచిర్యాల,మహబూబాబాద్,నాగర్ కర్నూల్,ఖమ్మం జిల్లాలు నిత్యం పోడు రణంతో రగులుతున్నాయని నిప్పులు చెరిగారు రేవంత్‌ రెడ్డి. పోడుకు హక్కు పత్రాలిస్తామని కేసీఆర్ ఓట్లు వేయించుకున్నాడు.ఇప్పుడు ఆడబిడ్డలను వివస్త్రను చేసి ఈడ్చిపారేస్తున్నారు. రేపటి కురుక్షేత్రంలో ఈ దుర్యోధన పాలన అంతం ఖాయమని కేసీఆర్‌ ను హెచ్చరించారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news