Breaking : భగ్గుమన్న కోనసీమ.. ఎమ్మెల్యీ ఇంటికి కూడా నిప్పు..

-

ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటులో పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్‌ పేరుగా మార్చుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించడంతో.. కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అమలాపురంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. కాగా, ఆందోళనకారులు దాడి చేయకముందే విశ్వరూప్ కుటుంబ సభ్యులు ఇంటినుంచి వెళ్లిపోయారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

MLA Ponnada Satish house set on fire in Konaseema

మంత్రి ఇంటి ఫర్నిచర్ ను, ఇంటి అద్దాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు, మంత్రి ఎదుట ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వసం చేసి, ఓ బైక్ ను దగ్ధం చేశారు. అటు, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ బాబు ఇంటికి కూడా నిప్పంటించారు. సతీష్ బాబు ఇక్కడి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు.. ఎస్పీ కారుపై కూడా ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news