నేడే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు.. గాంధీభవన్‌ లో ఏర్పాట్లు పూర్తి

-

ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ షురూ అయింది. ఇవాళ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ లు పోటీ పడుతున్నారు. అన్ని రాష్ట్రాల పిసిసి కార్యాలయాల్లో పోలింగ్ జరుగనుంది.

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. పోలింగ్ తర్వాత ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు వెళ్లనున్నాయి. ఇక ఇవాళ్టి ఎన్నికల కోసం ఏఐసీసీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇప్పటికే పోలింగ్ బూతులకు చేరుకున్నారు ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులు. ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నట్లు నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news