ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. హాట్ లుక్స్ లో కేక..!!

-

ప్రముఖ సీనియర్ నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్య రాజేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది .అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈమె తండ్రి రాజేష్ కూడా మంచి నటుడే.. కానీ ఈమె తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాజేష్ కి అందం ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక కొన్నేళ్లపాటు వెలుగులోకి రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. ఇక ఆ తర్వాత నాని టక్ జగదీష్ , సాయి తేజ్ రిపబ్లిక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇకపోతే తమిళనాడులో కూడా వరుస సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా అక్కడ కూడా స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఈమె తెలుగు అమ్మాయి.. ఇక హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు గా ఈమధ్య కాలంలో బాగా గుర్తింపు సంపాదించుకుంది.

38 సంవత్సరాలు వయసులోనే నటుడు రాజేష్ కన్నుమూసిన తర్వాత ఐశ్వర్య పడిన కష్టాలు మాత్రం ఎవరికి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. 1990 జనవరి 10వ తేదీన జన్మించిన ఐశ్వర్య రాజేష్ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. నిజానికీ సినిమా వాళ్ల జీవితాలు పైకి అందంగా కనిపించినా.. లోపల మాత్రం చాలా అతుకులు ఉంటాయి. ఒక రాయి తగిలితే పగిలిపోయే జీవితాలు వాళ్ళవి.

మరీ ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు అయితే మరీ దారుణమని చెప్పవచ్చు. ఇక ఐశ్వర్య రాజేష్ జీవితం కూడా అంతే.. ఇప్పుడంటే స్టార్ హీరోయిన్ అంటున్నారు కానీ ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదురీదింది. ఇక ఐశ్వర్యాకు తెలుగులో మంచి అవకాశాలు రావాలి అని ఆమె అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version