బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పాదాలు మొక్కిన అఖిలేష్ యాదవ్.. అందుకేనా..?

-

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పాదాలు తాకారు. అఖిలేష్ చేసిన పనితో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ గత నెలలో కన్నుమూశారు.

ములాయం ప్రాతినిథ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి డిసెంబర్‌ 5న ఉప ఎన్నిక జరగనుంది. అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్ యాదవ్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబానికి కంచుకోట అయిన సైఫైలో ఆదివారం ఎన్నికల సభ జరిగింది. ఈ సభావేదిక పైకి వచ్చిన అఖిలేష్‌ యాదవ్‌ అక్కడున్న బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ను చూశారు. ఆయన దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పాదాలు తాకారు.

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. బాబాయ్‌ను ఇతర బంధువులను ఎప్పుడూ కూడా దూరంగా పెట్టలేదని స్పష్టం చేశారు. రాజకీయపరంగానే దూరం ఉందని, ఇప్పుడు అది కూడా లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news