ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలెర్ట్.. ముందుగానే ప్రాక్టికల్స్‌ పరీక్షలు..!

-

ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్. ఇంటర్ ప్రాక్టికల్స్‌ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారనుంది. ప్రస్తుతం థియరీ పరీక్షలు పూర్తయ్యాక ప్రాక్టికల్స్ ఉండగా, వీటిని ముందుగానే నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తోంది.

ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు రెండు విడతలుగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. అయితే మే వరకు ప్రాక్టికల్స్ ఉండడంతో ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ విద్యా మండలికి విజ్ఞప్తులు పంపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version